కోహిమా : నాగాలాండ్లో ఆదివారం ఉదయం భూమి కంపించింది. ఉదయం 10.06 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. భూకంప కేంద్రాన్ని మొకోక్చుంగ్కు ఆగ్నేయ దిశలో 77 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు తెలిపింది. ప్రకంపనలతో జనం వణికిపోయి, ఇండ్ల నుంచి బయటకు పరుగులుపెట్టారు. అయితే నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఈ నెల 10న సైతం భూమి కంపించింది.