హైదరాబాద్ : శ్రవణ్ రాఘవేంద్ర కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎదురీత’. శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. బాలమురుగన్ దర్శకుడు. లియోనా లిషోయ్ కథానాయిక. అరల్ కొరెల్లి సంగీత దర్శకుడు. ఛాయాగ్రహణం విజయ్ అర్పుతరాజ్ ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. కొవిడ్ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత థియేటర్లలో మూవీని విడుదల చేసేందుకు నిర్మాతలు యోచిస్తున్నారు.
‘సై’, ‘డూకుడు’, ‘శ్రీమంతుడు’, ‘బిందాస్’, ‘మగధీర’, ‘ఏక్ నిరంజన్’ వంటి పలు సినిమాల్లో శ్రవణ్ ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఎదురీతతో తొలిసారి హీరోగా పరిచయమౌతున్నాడు.
ఈ చిత్రం గురించి నిర్మాత ఈశ్వర్ చరణ్ మాట్లాడుతూ.. 40 ఏళ్ల మధ్యతరగతి తండ్రి తన ఏకైక కొడుకును ఎంతగానో ప్రేమిస్తాడు. అతను ఏది కోరుకుంటే అది తీరుస్తుంటాడు. తన కొడుకు కోరుకున్నది ఇవ్వడానికి ఇష్టపడుతుంటాడు. అయితే అతని ప్రేమ ఏ సమస్యలకు దారితీస్తుందనేదే ఈ ‘ఎధురీత’ ఎమోషనల్ కోర్ అన్నారు. సెన్సార్ ఫార్మాలిటీలు పూర్తయినందుకు తాము సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. పాటలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చెప్పారు.
సంపత్ రాజ్, జియా శర్మ, షాన్వి మేఘన, నోయెల్ సీన్, పృద్వీ, మహేష్ అచంట, కాశీ విశ్వనాథ్, భద్రం, మాస్టర్ చరణ్, రవి ప్రకాష్ ఇతర తారాగణం.