ముంబై: న్యూజిలాండ్తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లాండ్ బయల్దేరనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 18న ఆరంభమవుతుంది. ఈ టూర్ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఐపీఎల్ 2021 సందర్భంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు అపెండిసైటిస్గా తేలడంతో శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంగ్లీష్ పర్యటనకు ఎంపికైన రాహుల్ టీమ్ఇండియాతోనే ఇంగ్లాండ్ వెళ్లేందుకు మార్గం సుగమమైంది.
వికెట్ కీపర్, బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడు. ఇంగ్లాండ్ టెస్టు్ టూర్ కోసం జూన్ 2న భారత జట్టుతో ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం ఉంది. రాహుల్కు సర్జరీ కావడంతో టూర్ ఆరంభానికి ముందు అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తే జట్టులోకి రావొచ్చని జట్టు ఎంపిక సమయంలోనే సెలక్టర్లు పేర్కొన్నారు.
‘అతను బాగానే ఉన్నాడు. నాకు తెలిసినంతవరకు పూర్తిగా కోలుకున్నాడు. అతను జట్టుతో కలిసి ఇంగ్లాండ్కు వెళ్లాలని’ రాహుల్తో సన్నిహితంగా ఉండే ఆటగాడు ఒకరు చెప్పారు.
రాహుల్ చివరిసారిగా ఆగస్టు-సెప్టెంబర్ 2019లో వెస్టిండీస్తో టెస్టులో ఆడాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్లో రాహుల్ జట్టులోనే ఉన్నాడు. కానీ ఆడే అవకాశం రాలేదు. 29ఏండ్ల రాహుల్ ఇప్పటి వరకు 36 టెస్టు మ్యాచ్ల్లో 2006 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు, 11 అర్ధశతకాలు
ఉన్నాయి.