కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అడ్విన్ టెక్ సంస్థ ముందుకు వచ్చింది. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వారు చేపడుతున్న కొవిడ్ నివారణ సేవలకు వారి వంతుగా 20 లక్షలను సోమవారం గచ్చిబౌలి కమిషనర్ కార్యాలయంలో సీపీ సజ్జనార్, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదులకు చెక్కు ద్వారా అందించారు. అదే విధంగా రెండు అక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఈ సహకారాన్ని అందించిన సంస్థ డైరక్టర్ సూర్య ప్రకాష్, మురళీధర్ను అభినందించారు