వీధులన్నీ రసాయనాలతో పిచికారీ
ఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ
ఆమనగల్లు, మే 18 : ప్రభుత్వ ఆదేశానుసారం పంచాయ తీలో ముమ్మరంగా పారిశుధ్య నివారణ చర్యలు కొన సాగుతున్నాయి. ఆమనగల్లు బ్లాక్ మండల్లోని వివిధ పంచాయతీల్లో కార్యదర్శులు నిత్యం గ్రామా ల్లో పర్య టిస్తున్నారు. గ్రామాల్లో కరోనా విస్తరించకుండా వీధులన్నీ సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టి పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని కోరుతూ అవగాహన కల్పిస్తున్నారు. పల్లె వాసులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ముంద స్తు చర్యలు చేపడుతున్నారు. వీధుల్లో చెత్తలేకుండా డ్రైనే జీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. పంచాయ తీల్లో పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ట్రాక్టర్లతో రసాయ నాలు పిచికారీ చేస్తున్నారు. అంతేకాకుండా జ్వర లక్షణా లు ఉన్న వారిని గుర్తించి ఇబ్బందులు లేకుండా వారికి వైద్య సేవ లు అందిస్తున్నారు. పంచాయతీలో పాలక వర్గం పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు పర్యటించి పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరుతున్నారు.
ఇన్ముల్నర్వలో ఇంటింటికీ శానిటైజేషన్
కొత్తూరు రూరల్, మే 18: కొత్తూరు మండలపరిధిలోని ఇన్ముల్నర్వలో మంగళవారం సర్పంచ్ అజయ్ నాయక్ ఆధ్వర్యంలో ప్రతి కాలనీలోని వీధుల గుండా, ప్రతి ఇంటింటికి తిరిగి ట్రాక్టర్, చేతి పంపుతో శానిటైజేషన్ చేశారు. కాలనీల్లో మురుగు నీరు నిల్వ కుం డా, దోమల బెడద లేకుండా గ్రామపంచాయతీ సిబ్బంది తో బ్లీచింగ్ పౌడర్ను చల్లించారు. వాటర్ ట్యాంక్లను శుభ్రం చేయిం చారు. కరోనా వ్యాధి భారిన పడకుండా ప్రజలకు అవగా హన కల్పించారు. రోడ్లపై దుకాణ సము దాయాల వద్ద హైపోక్లోరైడ్ ద్రావాణాన్ని పిచికారీ చేయిం చారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
షాబాద్, మే 18: ప్రజలు ఎవరి పరిసరాలను వారే శు భ్రంగా ఉంచుకోవాలని సర్దార్నగర్ సర్పంచ్ మునగపాటి స్వరూప అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్దార్నగర్లో పంచాయతీ సిబ్బందితో కాలనీల్లో సోడి యం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. గ్రామంలోని అన్ని కాలనీలో పారిశుధ్య చర్యలు చేపట్టా మన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధు సూదన్రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహులు పాల్గొన్నారు.
ఉప్పరిగూడ సర్పంచ్ ఆధ్వర్యంలో..
ఇబ్రహీంపట్నంరూరల్, మే 18 : కరోనా నియంత్రణకు ఉప్పరిగూడ సర్పంచ్, సర్పంచ్లఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి ఆపత్కాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అండగా నిలుస్తున్నారు. గ్రామాల్లో కరో నా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సొంత ఖర్చులతో ప్రతిరోజూ గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నారు. ఈ వాహనం ద్వారా రెండు నుంచి మూడు గ్రామాల్లో పిచికారీ చేస్తూ కరోనా నియం త్రణకు కృషిచేస్తున్నారు. పక్క నియోకవర్గాల్లోని గ్రామా లకు ఈ వాహనం ద్వారా మందులను పిచికారీ చేయి స్తున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని మైక్ ద్వారా చాటింపు వేయిస్తున్నారు.
పారిశుధ్యంపై ప్రధాన దృష్టి
యాచారం, మే 18 : మండలంలో కరోనా కేసులు పెరు గుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా పారి శుధ్యంపై ప్రధాన దృష్టి సారించారు. మంగళవారం మం డలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో సీఐ లింగయ్య, ఎస్ఐ పద్మయ్య, సర్పంచ్ సంతోష, ఉపసర్పంచ్ శ్రీశైలం గ్రా మంలోని ప్రధాన రోడ్లు, మురుగునీటి కాలువలు, వీధు ల్లో రసాయనాలను స్వయంగా పిచికారీ చేశారు. రోడ్లు, వీధులు ఊడ్చి బ్లీజింగ్ పౌడర్ను చల్లి శుభ్రం చేశారు. ట్యాంకులు, సంపులను సైతం శుభ్రం చేశారు. ఈ సంద ర్భంగా సీఐ లింగయ్య మాట్లాడుతూ ప్రజలు బయటకు వెళితే తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని సూచించారు. చేతులను శానిటైజర్, సబ్బుతో తరుచూ శుభ్రం చేసుకో వాలన్నారు. గుంపులుగా ఉండొద్దని అవగాహన కల్పిం చా రు. కరోనా కట్టడికి గ్రామాల్లో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో కంబాలపల్లి రమేశ్ పాల్గొన్నారు.