టాలీవుడ్ (Tollywood) భామ సమంత (Samantha), నాగచైతన్యతో విడాకుల తర్వాత మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. క్రమం తప్పకుండా చేసే జిమ్ యాక్టివిటీస్లో ఇటీవలే మళ్లీ పాల్గొంది సామ్. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసింది. అయితే ఈ సారి ఆధ్యాత్మిక చింతనతో తన ప్రయాణాన్ని సాగిస్తోంది సమంత.
స్నేహితులతో కలిసి ఉత్తరాఖండ్ (Uttarakhand trip) యాత్రకు వెళ్లింది సామ్. ఉత్తరాఖండ్లోని ఓ ఆశ్రమాన్ని సందర్శించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మానసిక ప్రశాంతత కోసం ఆధ్మాత్మిక మార్గంలో వెళ్లిన సమంత టీం రిషికేశ్లోని The Roseate Gangesలో బస చేసింది. నెల లేదా 2 నెలలు విరామం తీసుకోవాలనుకున్నా. నేను కొంత కాలిపోయానన్న భావన కలుగుతోంది..అంటూ సమంత అక్కడి మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చిన మాటలు ఆమెలోని బాధను వ్యక్తపరుస్తున్నాయి.
సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో తెరకెక్కుతన్న కాథువాకుల రెండు కాధల్ లో కీలక పాత్రలో నటిస్తోంది. విజయ్ సేతుపతి, నయనతార కీ రోల్స్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha | హీరో కోసం చూస్తున్న సమంత..!
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Preetham: ఆగని మాటల దాడి.. చైతూ స్పందించాలని కోరుతున్న సమంత స్టైలిస్ట్