న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో వాయిదా పడుతున్న పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే క్లాట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలు పోస్ట్పోన్ అయ్యాయి. తాజాగా మరో ఎంట్రెన్స్ టెస్ట్ వాయిదాపడింది. ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్ఈటీ)2021ను నేషనల్ లా యూనివర్సిటీ వాయిదావేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 20న జరగాల్సి ఉన్నది. కరోనా నేపథ్యంలో పరీక్షను వాయిదా వేశామని, మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిష్ఠాత్మక ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో బీఏ ఎల్ఎల్బీ (హానర్స్), ఎల్ఎల్ఎం, పీహెచ్డీ కోర్సులు అడ్మిషన్ కల్పిస్తారు.
కాగా, పరీక్ష వాయిదా పడిన నేపథ్యంలో దరఖాస్తు గడువును జూన్ 25 వరకు పొడిగించింది. దరఖాస్తు చేసుకోవాలనేవారు అధికారిక వెబ్సైట్లో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. అప్లికేషన్ ఫీజు రూ.3050 చెల్లించాల్సి ఉంటుందని, ఎలాంటి వయోపరిమితి లేదని వెల్లడించింది. ఎన్ఎల్యూలో ప్రవేశాల కోసం ప్రతి ఏటా ఏఐఎల్ఈటీని నిర్వహిస్తారు.
వెబ్సైట్: nludelhi.ac.in.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి