కుత్బుల్లాపూర్ జోన్ బృందం,జూలై 6 : నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లతో పాటు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల్లో హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు,అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మొక్కలు నాటుతున్నారు. కుత్బుల్లాపూర్,గాజులరామారం జంటసర్కిళ్లకు చెందిన అధికారులతో ఎమ్మెల్యే వివేకానంద్ మంగళవారం సమావేశమయ్యారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తయ్యేలా నోడల్ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పచ్చదనం పెంపొందించాలని తెలిపారు. డీసీలు మంగతాయారు, రవీందర్కుమార్ పాల్గొన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో నిర్వహించిన పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమంలో మేయర్ కొలన్నీలాగోపాల్రెడ్డి,కమిషనర్ గోపి పాల్గొన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వాకలపూడి రవికిరణ్, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు రంగరాయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, 27 వ వార్డులోని బంజారా పార్కులో కౌన్సిలర్ శంకర్నాయక్ మొక్కలు నాటారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9వ వార్డుల్లో కమిషనర్తో పాటు నోడల్ అధికారులు ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. కమిషనర్ రఘు, డీఈఈ విజయలక్ష్మి, కౌన్సిలర్లు సూర్యకళ, రజిని తదితరులు పాల్గొన్నారు.
132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రామలింగరాజు కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ తారా చంద్రారెడ్డిలతో పాటు సర్కిల్ నోడల్ అధికారి శ్రీనివాసులు, ఏఈ సురేందర్నాయక్, హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ శివప్రసాద్ మొక్కలు నాటారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జంట సర్కిళ్ల డీసీలు మంగతాయారు, రవీందర్కుమార్ పాల్గొన్నారు.
గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ పరిధి వివేకానందనగర్ కాలనీలో కార్పొరేటర్ రషీదాబేగం మొ క్కలు నాటారు. అనంతరం బ్యాడ్మింటన్ క్రీడా సామాగ్రిని ఆమె స్థానికులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ఫ్రీ, కుత్బుల్లాపూర్ జలమండలి జీఎం శ్రీధర్రెడ్డి, జీహెచ్ఎంసీ ఏఈ సంపత్, జలమండలి మేనేజర్ రమ్య భారతి, శానిటేషన్ సూపర్వైజర్ దుర్గారావు, సంక్షేమ సంఘం అధ్యక్షుడు చందు తదితరులు పాల్గొన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సోమయ్యనగర్లో కార్పొరేటర్ కొలుకుల జగన్ మొక్కలు నాటారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, కాలనీ అధ్యక్షుడు యాదగిరి, మనోజ్, ప్రకాశ్, సత్తిరెడ్డి, మహేశ్, ప్రభు, హనుమంత్రెడ్డి, సంపత్రెడ్డి, అశోక్, రాంశెట్టి పాల్గొన్నారు.