హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ నేత కే కేశవరావును పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. కేకేతోపాటు మరో ముగ్గురు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకు వివిధ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో చోటు లభించింది. సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీలో బండప్రకాశ్, హౌజ్ కమిటీలో బడుగుల లింగయ్యయాదవ్ను సభ్యులుగా నియమించారు. మరో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డిని రూల్స్ కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది.