టాలీవుడ్ యాక్టర్ నితిన్ ఎడిటర్ కమ్ డైరెక్టర్ ఎస్ శేఖర్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన చేయనున్నాడు నితిన్. సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్లో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇప్పటికే నటీనటుల ఎంపిక కూడా ఫైనల్ అయినట్టు టాక్. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
ఉప్పెన సినిమాతో కుర్రకారు మనసు దోచేసిన కృతిశెట్టిని ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం ఎంపిక చేసినట్టు వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కృతిశెట్టి కూడా నితిన్ తో సినిమాకు సైన్ చేసిందని, త్వరలోనే షూటింగ్ లో కూడా పాల్గొనబోతుందని టాక్. నితిన్-కృతిశెట్టి ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలపై కొన్ని రోజులు ఆగితే స్పష్టత రానుంది. ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమాతో బిజీగా ఉన్నాడు నితిన్. కృతిశెట్టి ప్రస్తుతం రామ్తో సినిమా చేస్తోంది. దీంతోపాటు నానితో శ్యామ్ సింగరాయ్ లో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
సినిమాలకు యువ హీరో గుడ్బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?