నాగారం, మే 3 : కరోన విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. సోమవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ పరిసరాల పరిశుభ్రత పాటించేలా, మాస్కు ధరించి భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట మండల వైద్యాధికారి డాక్టర్ పెద్దపల్లి సరళ, పీహెచ్ఎన్ ధనమ్మ, ప్రవీణ్రెడ్డి, శోభ, కవిత, యాదగిరి తదితరులు ఉన్నారు.
తుంగతుర్తిలో 40మందికి పాజిటివ్
తుంగతుర్తి/నాగారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సోమవారం 150మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 40మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ నాగునాయక్ తెలిపారు.
చివ్వెంల లో40 మందికి
చివ్వెంల : మండల కేంద్రంలోని పీహెచ్సీలో సోమవారం 159మందికి కరోనా పరీక్షలు చేయగా 40మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ రాజ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు.
మున్సిపాలిటీ సిబ్బందికి మాస్కుల పంపిణీ
తిరుమలగిరి : తిరుమలగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి చైర్పర్సన్ పోతరాజు రజిని సోమవారం మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : మండలంలోని కాసరబాద గ్రామంలో సర్పంచ్ కొల్లు రేణుక ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటికీ తిరిగి బ్లీచింగ్ పౌడర్, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. మార్కెట్ డైరెక్టర్ సంకరమద్ది రమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సలీం, వార్డు సభ్యులు బంటు పద్మ, దుండిగాల రాజు, చింత పిచ్చమ్మ, భాస్కర్, గోగుల లక్ష్మి, రమేశ్, టీఆర్ఎస్ నాయకుడు కొల్లు నరేశ్ పాల్గొన్నారు.
కామాటీలకు పీపీ కిట్ల పంపిణీ
మునగాల : మండలంలోని నారాయణగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ గోపిరెడ్డి వెంకట్రెడ్డి కామాటీలకు పీపీ కిట్లు, శానిటేషన్ క్యాన్, ఫేస్ షీల్డులు పంపిణీ చేశారు. కరోనా కాలంలో కామాటీల సేవలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.