మిర్యాలగూడ,మే16 : మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 23వ వార్డు అశోక్నగర్లో రూ.30 లక్షలు, 25వ వార్డు సంతోశ్నగర్ కాలనీలో రూ.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వర్రావు, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, అన్నభీమోజు నాగార్జునాచారి, వంగాల నిరంజన్రెడ్డి, ఖాజా మొయినుద్దీన్,కృష్ణమూర్తి, అయిల వెంకన్న, శ్యాంసుందర్, భీమ్లా పాల్గొన్నారు.
మార్కెట్ల ఏర్పాటుకు స్థల పరిశీలన
మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపులో వెజ్, నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాన్ని ఆదివారం ఎమ్మెల్యే భాస్కర్రావు పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ నంబర్ 65 ప్రకారం పట్టణంలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మించాల్సి ఉందని, అం దుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం అక్కడే నిర్మిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ హాళ్లను పరిశీలించారు.
పలు కుటుంబాలకు పరామర్శ
పట్టణంలోని చైతన్యనగర్, ఈదులగూడ కాలనీలకు చెందిన రావులపల్లి రమణయ్య, పుట్ట ప్రతాప్రెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా మృత దేహాలపై పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.