దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముగ్గురి అరెస్ట్
నిందితుల నుంచి రూ.6లక్షల ఫేక్కరెన్సీ స్వాధీనం
రామచంద్రాపురం, మే 29 : దొంగనోట్లు చెలమణి చేస్తున్న ముగ్గురిని ఆర్సీపురం పోలీసులు అరెస్ట్ చేసి, శనివారం రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. ఒంగోలు జిల్లా ప్రగతినగర్కు చెందిన కంచెర్ల శివనారాయణరెడ్డి అలియాస్ శివారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో లింగంపల్లి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా కన్పించడంతో అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతని చేతులోని కవర్ను తనిఖీ చేయగా, అం దులో రూ.2వేల నోట్లు మొత్తం రూ.6లక్షలు దొంగనోట్లు ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులు శివారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతనితో పాటు చెల్ల తిమ్మనాయుడు, లలిత కూడా దొంగనోట్లు చెలామణి చేస్తున్నారని చెప్పాడు. చెల్ల తిమ్మనాయుడిని అంబర్పేట, లలితను సరూర్నగర్లో పోలీసులు అదుపులోకి తీసుకొని, రిమాండ్కు తరలించారు.