తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో బ్లూషర్ట్ నీలి కవాతు ర్యాలీని బుధవారం బషీర్బాగ్లోని బాబూజగ్జీవన్రాం విగ్రహం నుంచి ట్యాంక్బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ కవాతుకు మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకులు గజ్జల కాంతం, ఎస్సీ కార్పొరేషన్ మాజీ పిడమర్తి రవి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. దేశంలో దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలను బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని వారు విమర్శించారు. అంతే కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేయడానికి నరేంద్రమోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మారయ్య, బీసీ సంఘం నాయకులు ప్రదీప్, మహేశ్, రాములు పాల్గొన్నారు.