ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ (Tollywood) సినీ రంగ ప్రవేశం చేశాడు హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఈ యువ హీరో ప్రస్తుతం క్రిష్ (Krish) దర్శకత్వంలో కొండపొలం సినిమా చేస్తున్నాడు. కాగా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్ తో పంజా (Panja) సినిమా తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ తో ఈ యువ హీరో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
ఉప్పెన షూటింగ్ సమయంలో కొత్త కథలు వినొద్దని చిరు, పవన్ వైష్ణవ్ తేజ్కు సూచించారట. అయితే ఉప్పెన బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధించడంతో వైష్ణవ్ తేజ్ డైరెక్టర్ విష్ణువర్దన్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే విష్ణు వర్దన్ తెరకెక్కించిన షేర్షా సినిమా మంచి విజయం అందుకోవడంతో ఫుల్ జోష్ మీదున్నాడు విష్ణువర్దన్. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్ణువర్దన్ ఇపుడు యువ హీరోతో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.
కోవిడ్ మమమ్మారి సమయంలోనే రెండో చిత్రం కొండపొలం షూటింగ్ పూర్తి చేశాడు వైష్ణవ్ తేజ. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో అక్టోబర్ లో విడుదల కానుంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఓ సినిమాకు పచ్చ జెండా ఊపాడు వైష్ణవ్ తేజ్.
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!