అక్కినేని హీరో సుశాంత్ (Sushanth)నటిస్తోన్న తాజా చిత్రం ఇచట వాహనములు నిలుపరాదు (Ichata Vahanamulu Nilupa Radu). ఆగస్టు 27న (రేపు) విడుదల కానుంది. అభినవ్ గోమాటం, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా సుశాంత్ పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. చిలసౌ సినిమా తర్వాత తన సినిమాల షూటింగ్స్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు సుశాంత్. దర్శన్ (Darshan) ఈ సినిమా కథతో చిలసౌ కు ముందు నా దగ్గరకు వచ్చాడు.
చిలసౌ పూర్తి చేసిన తర్వాత నేను ఈ ప్రాజెక్టును చేయాలనుకున్నా. కానీ, అప్పుడు అల వైకుంఠపురంలో సినిమా ఉంది. త్రివిక్రమ్ తో పనిచేసే ఛాన్స్ మిస్సవ్వకూడదనుకున్నా. అయితే నేనీ సినిమా ఖచ్చితంగా చేస్తానని ఖచ్చితంగా అప్పుడే మాట ఇచ్చినట్టు చెప్పాడు సుశాంత్. ఈ సినిమా చాలా రియలిస్టిక్, వినోదాత్మకంగా సాగుతుంది. మాకు చాలా ప్రశ్నార్థకాలు ఉన్నాయి. మా దగ్గరకు చాలా ఓటీటీ డీల్స్ వచ్చాయి. నేను కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు, మాకు చాలా మంచి నాన్-థియేట్రికల్ డీల్స్ వచ్చాయి.
ఇక అప్పుడే మేము థియేటర్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు సుశాంత్. సరైన అమ్మాయి దొరికినపుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పాడు సుశాంత్. అదృష్టవశాత్తూ, మా అమ్మ కూడా నన్ను నా పెళ్లికి బలవంతం చేయలేదన్నాడు.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ