హైదరాబాద్ : డాక్టర్ సి.నారాయణరెడ్డి, ‘వంశీ విజ్ఞాన పీఠం శ్రీ సాంస్కృతిక కళాసారథి’, సింగపూర్, ‘సాహితీ కిరణం’ మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు అంతర్జాల వేదికపై నిర్వహించిన కవితా మహోత్సవం ఘనంగా జరిగింది. 17 దేశాల నుంచి పాల్గొన్న 250 మంది కవయిత్రులతో అద్వితీయంగా నిర్వహించబడిన ‘ప్రపంచ మహిళ తెలుగు కవితా మహోత్సవం’ ప్రపంచ స్థాయిలో రికార్డ్ నెలకొల్పింది.
కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ.. అంతర్జాలం ద్వారా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. అయితే కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో మహిళా కవయిత్రులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.
కవయిత్రులు కేవలం వారం రోజుల్లో ముందుకొచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఇందుకు గాను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారు తమ ప్రయత్నానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డు రికార్డు చేయబడిందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ నెల 23, 24, 25 తేదీలలో జరిగిన ఈ అంతర్జాల కార్యక్రమంలో మొదటిరోజు భువనచంద్ర, డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి, రెండో రోజు డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి, మూడో రోజు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, మామిడి హరికృష్ణ, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్, సాహితీ కిరణం మాసపత్రిక సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, వివిధ దేశాలలోని తెలుగు సంస్థల అధ్యక్షులు రచయిత్రులు పాల్గొన్నారు.
రాధికా మంగిపూడి సింగపూర్, జుర్రు చెన్నయ్య హైదరాబాద్, జయ పీసపాటి హాంకాంగ్, రాధిక నోరి అమెరికా, కార్యక్రమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఆసక్తికరంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. రచయిత్రులు వారి దేశ కాలమానాలకు అనుగుణమైన సమయాలలో విచ్చేసి తమ కవితలను ఈ వేదికపై పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి..
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం