నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబసభ్యులు పరామర్శించారు. రోగుల యోగక్షేమాలను గుత్తా కుమారుడు అమిత్ రెడ్డి, కోడలు అఖిల అడిగి తెలుసుకున్నారు. ఇతర రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 300 మంది కోవిడ్ బాధితులకు గుత్తా వెంకట్ రెడ్డి ట్రస్ట్ తరుపున ఇమ్యూనిటీ పవర్ను పెంచే డ్రై ఫ్రూట్స్తో పాటు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, డీఎంహెచ్వో కొండల్ రావు, సూపరింటెండెంట్ రాథోడ్, ఐంఎఏ జిల్లా అధ్యక్షుడు పుల్లారావు, టీఆర్ఎస్ నాయకులు యామ దయాకర్, అలకుంట్ల మోహన్ బాబు, గోవర్ధన్ రెడ్డి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.