మహబూబ్ నగర్ : శాంతిభద్రతల పరిరక్షణలో విశేషంగా కృషి చేస్తున్న పోలీసులకు అండగా ఉంటున్న వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన కామ్సన్ హెల్త్ కేర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ కుమార్ పోలీసు సిబ్బందికి ఉపయోగపడే విధంగా శానిటైజర్లను ఎస్పీకి అందించారు. విపత్తులు సంభవించి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమాజం మొత్తం మానవీయ కోణంలో స్పందించడం మనలోని ఐక్యతను చాటుతుందని ఎస్పీ పేర్కొన్నారు.
గత ఏడాది నుంచి ఒక కరోనా మహమ్మారి మనను ఇబ్బంది పెడుతోందన్నారు. ప్రజలంతా లాక్ డౌన్ సమయంలో బాధ్యతగా ఇంట్లోనే ఉండి సహకరించాలని కోరారు. పోలీసుల విధి నిర్వహణలో అవసరమైన శానిటైజర్స్ అందించిన కామ్సన్ హెల్త్ కేర్ ఎండీ మనీష్ ను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి