వనపర్తి : అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త తాను కూడా తనువు చాలించిన సంఘటన జిల్లాలోని పాన్గల్ మండలం మల్లాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. మల్లాయిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి దేవమ్మ, కర్రెన్న అన్యోన్య దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశారు. అందరూ వేర్వేరుగా ఉంటూ జీవనం గడుపుతున్నారు.
కాగా, లక్ష్మీదేవమ్మ, కర్రెన్నలు ఇద్దరు కలిసి వేరుగా ఉంటూ జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా భార్య లక్ష్మి దేవమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందగా అంత్యక్రియలు జరిపారు.
ఎంతో మనోవేదన గురైన కరెన్న (85) భార్య మృతిని జీర్ణించుకోలేక ఆదివారం మృతి చెందాడు. అటు భార్య, ఇటు భర్త మరణం చెందడం పట్ల మరణంలోను వీడని బంధం అని పలువురు చెప్పుకుంటున్నారు
ఇవి కూడా చదవండి..
శంషాబాద్లో కారు,లారీ ఢీ..ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు
ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత