హైదరాబాద్ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి(35) సోమవారం రాత్రి డబీర్పుర-యాకత్పుర రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు.
మృతుడి ఒంటిపై ఎరుపు రంగు చొక్క, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిసిన వారు 9573561549లో సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు. షర్ట్ జేబులో ఆర్మూర్ నుంచి జూబ్లీహిల్స్ వరకు ఆర్టీసీ బస్సు టికెట్ ఉన్నట్లు తెలిపారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల