టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ షూటింగ్స్ కు దూరమై ఏడాదికి పైగా అవుతుంది. గతేడాది ఫస్ట్ లాక్డౌన్ కు ముందు రెడ్ షూటింగ్ పూర్తి చేశాడు రామ్. ఈ చిత్రం 2021 సంక్రాంతికి విడుదలైంది. ఇక రీసెంట్గా లింగుస్వామి డైరెక్షన్ లో సినిమాను లాంఛ్ కూడా చేశాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. జులై మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఇటీవలే కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న రామ్ ఇపుడు వర్క్ లో జాయిన్ అయ్యే కంటే ముందు సినిమా కోసం మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నాడట. ఉప్పెన చిత్రంతో గ్రాండ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. మరోవైపు రామ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడని వార్తలు వచ్చినా వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
నా బాయ్ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!