హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో సరిహద్దులో బుధవారం నుంచి ఆంక్షలు విధిస్తున్నట్టు కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అత్యవసర, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు మినహా ఇతర ఏ వాహనాలకు అనుమతిలేదని పేర్కొన్నారు. ఏపీలోని పాక్షిక లాక్డౌన్ నేపథ్యంలో రెండువారాలపాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు.