పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు కే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే షురూ అయింది. ఈ చిత్రానికి ప్రభాస్ బల్క్ డేట్స్ ను కేటాయించాడట. తాజాగా నడుస్తున్న టాక్ ప్రకారం ప్రభాస్ ప్రాజెక్టు కే కోసం 200 రోజులు డేట్స్ ఇచ్చాడని టాక్. అంతేకాదు ప్రభాస్ త్వరలోనే సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడట. ఈ చిత్రంలో 90 శాతం రామోజీఫిలింసిటీలో షూట్ చేయనున్నారు. మేకర్స్ ప్రస్తుతం షూటింగ్ కోసం స్పెషల్ సెట్ డిజైన్ పనిలో ఉన్నారు.
కీ రోల్ చేస్తున్నఅమితాబ్ బచ్చన్ ఇప్పటికే చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్నటి దీపికా పదుకొనే కీలకపాత్రలో నటిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రభాస్ మరోవైపు రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేశాడు. దీంతోపాటు ఆదిపురుష్, సలార్ చిత్రాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరించేందుకు రాబోతున్నాడు ప్రభాస్.
ఇవి కూడా చదవండి..
రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
‘రామారావు’తో వేణు గ్రాండ్ కమ్బ్యాక్
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..