సంగారెడ్డి : జిల్లాలోని కల్వరి టెంపుల్లో వంద ఐసోలేషన్ పడకలను ఆర్థిక మంత్రి హరీష్ రావు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 2, 3 రోజుల్లో జహీరాబాద్ ఆస్పత్రికి 500 లీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుందన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు చెల్లించిందని తెలిపారు. రాష్ర్టాలకు వ్యాక్సిన్ల పంపిణీని కేంద్రం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.