హైదరాబాద్ : కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి వల్ల కోవిడ్ వ్యాప్తి రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ కరోనా నిర్మూలనకు ఎన్నో పటిష్టమైన చర్యలు చేపట్టి కరోనా నివారణకు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం దాదాపు 4వేల మంది కరోనా (యాక్టీవ్) రోగులకు కావల్సిన చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరి యోగ క్షేమాలను నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకొని అవసరమైన సేవలను అందించాలని మంత్రి కోరారు.
నియోజకవర్గంలోని ప్రజలందరికి మాస్కులను పంపించామన్నారు. అందరికి సక్రమంగా పంపిణీ అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి