మన్సూరాబాద్, జూన్ 29: భూగర్భ డ్రైనేజీ ట్రంక్లైన్ ఏర్పాటు పనులను వేగవంతం చేసి కాలనీల్లో వరదనీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ శైలజాపురికాలనీ నుంచి హిమపురికాలనీ వరకు రూ.33లక్షలతో ఏర్పాటు చేస్తున్న యూజీడీ ట్రంక్లైన్ ఏర్పాటు పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వానకాలంలో ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు మాన్సూన్ బృందాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, నాయకులు చెరుకు ప్రశాంత్గౌడ్, రాజు, ప్రతీక్ తదితరులు పాల్గొన్నారు.