‘విజేత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో కళ్యాణ్ దేవ్ (Kalyandev). మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)అల్లుడుగా టాలీవుడ్ (Tollywood)కు వచ్చాడు ఈయన. తొలి సినిమా విజయం సాధించకపోయినా కూడా నటుడిగా కళ్యాణ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు కళ్యాణ్ దేవ్. సూపర్ మచ్చి అనే ఒక సినిమా చేసాడు కానీ ఇప్పటివరకు అది విడుదల కాలేదు. కరోనా కారణంగా ఇంకా బాక్స్ లోనే ఉండిపోయింది సూపర్ మచ్చి. దీంతో పాటు కిన్నెరసాని అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.
ఈ మధ్య విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలు కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. ఇదిలా ఉంటే అప్పుడే మరో సినిమా మొదలు పెట్టాడు కళ్యాణ్ దేవ్. MP ఆర్ట్స్ బ్యానర్ లో మోనిష్ పత్తిపాటి నిర్మాతగా ఎం కుమారస్వామి నాయుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.
అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. YS కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గౌతి హరినాథ్ నిర్మాణ నిర్వహణ చూసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. ఒక సినిమా అనుభవంతో వరుస సినిమాలు చేస్తున్నాడు మెగా అల్లుడు. మరి వీటిలో ఈయన కోరుకునే విజయం ఏది తీసుకొస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్