15 మంది వ్యాపారులకు జరిమానా
ఎల్బీనగర్, మే 18 : పండ్ల పక్వానికి నిషేధిత చైనా ఇథలిన్ పౌడర్ వాడుతున్న వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝలిపించారు. మంగళవారం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డులోని దుకాణాల్లో ఫుడ్సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. మామిడిపండ్ల పక్వానికి చైనా ఇథలిన్ వాడుతున్న 15మంది వ్యాపారులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని కమీషన్ ఏజెంట్లకు, పండ్ల విక్రయదారులకు అవగాహన కల్పించారు.