ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఓ పూజారి .. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కలాం ఓ జిహాదీ అంటూ పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ముస్లింలు ఎవరూ ఇండియాకు అనుకూలంగా ఉండరని, కలాం ఓ జిహాదీ అని అన్నారు. అలీఘడ్లోని దస్నాదేవి ఆలయ పూజారి యతి నర్సింగానంద సరస్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. డీఆర్డీవో చీఫ్గా ఉన్న సమయంలో కలాం.. పాకిస్థాన్కు అణు బాంబు ఫార్ములాను సప్లయ్ చేసినట్లు ఆరోపించారు. రాష్ట్రపతి భవన్లో ఉన్న సమయంలో కలాం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారని, అక్కడ ముస్లింలు మాత్రమే ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఇటీవల ఘజియాబాద్ ఆలయ ప్రాంగణంలో ఓ ముస్లిం కుర్రాడు నీళ్లు తాగిన ఘటనపై స్పందిస్తూ ఆ పూజారి ఈ కామెంట్స్ చేశారు. ఆ కేసులో షిరంగి నందా యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.