టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు వరుస క్రమంలో వారి నుంచి వివరాల సేకరణ ప్రారంభించారు. తెలంగాణ ఎక్సైజ్శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు ఈ మేరకు ఆగస్టు 17న చార్మికి నోటీసులు జారీ చేశారు. నేడు ఆమె విచారణకు హాజరుకానుంది. విచారణకు హాజరయ్యేందుకు వచ్చేప్పుడు తగిన పత్రాలను, బ్యాంకు లావాదేవీల వివరాలు తీసుకురావాలని ఆ నోటీసులలో ప్రత్యేకంగా సూచించారు.
కెల్విన్-చార్మి మద్య వాట్సప్ చాటింగ్పైనా ఆరా తీయనున్న ఈడీ
కెల్విన్కు నటి చార్మికి మధ్య వందల సార్లు వాట్సప్ చాటింగ్ జరిగినట్టు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభించాయి. అదేవిధంగా కెల్విన్ ఫోన్లోనూ చార్మి నంబర్ దాదా అనే మారుపేరుతో సేవ్ చేసి ఉంది. నేరుగా కెల్విన్తో చార్మి ఎందుకు మాట్లాడింది. అసలు వీరిద్దరికీ ఎలా పరిచయం..డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించి పెద్ద మొత్తంలో చార్మి నుంచి డబ్బులు కెల్విన్కు వెళ్లినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. ఇదే అంశాలపైన గురువారం నాటి విచారణలో ఈడీ అధికారులు దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే చార్మి బ్యాంక్ ఖాతాల లావాదేవీలను గత నాలుగేండ్లవి ఈడీ అధికారులు సేకరించారు.