టైగర్ సిరీస్ చిత్రాల్లో సల్మాన్ఖాన్ యాక్షన్ ధమాకా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు టైగర్ 3 చిత్రం సల్మాన్ చేస్తుండగా, ఇందులో సల్మాన్ఖాన్తో తలపడే ప్రతినాయకుడి పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. దీనికోసం భారీగా కసరత్తులు చేస్తున్నారు ఇమ్రాన్. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు సల్లూ భాయ్.
టైగర్ 3 చిత్ర షూటింగ్ కోసం ఇటీవల బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కత్రినాలు టర్కీ వెళ్లారు. వారికి మంత్రి ఆతిథ్యం ఇచ్చారు. టర్కీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న టర్కిష్ వ్యాపారవేత్త, రాజకీయవేత్త మెహ్మెత్ నూరి ఎర్సోయ్ .. సల్మాన్, కత్రినాలతో కలిసి ఫొటో దిగి,ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అంతర్జాతీయ తారలు… సినిమా ప్రాజెక్టులకు దేశం మద్దతు ఇస్తుంది. మంచి ఆతిథ్యం ఇస్తుంది అని మెహ్మెత్ నూరి ఎర్సోయ్ టర్కిష్లో రాశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకానొకప్పుడు సల్మాన్, కత్రినా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు గట్టిగా పట్టుబట్టారు. పైగా వీరిద్దరూ డేటింగ్ అంటూ రూమర్లు కూడా వచ్చాయి. ఏమైతేనేం సల్మాన్ అభిమానుల కోరిక మాత్రం తీరడం లేదు.
టైగర్ 3” కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న మూడవ చిత్రం. సల్మాన్ ఖాన్ ఇందులో స్పెషల్ ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ పాత్రలో నటించనుండగా, కత్రినా కైఫ్ మళ్లీ జోయా హుమాయినిగా కనిపించనుంది.