బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీసెంట్గా రాధే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వలన ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇక ఆయన నటిస్తున్న మరో చిత్రం టైగర్ 3 సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గత ఏడాది మార్చిలో మొదలైంది. కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత మూవీ షూటింగ్ ఆగింది. గుర్గావ్లో ప్రత్యేకంగా సెట్ వేయగా, ఇప్పుడు ఆ సెట్ తౌటే తుపాను దెబ్బకు పాక్షికంగా దెబ్బతింది.
కరోనా వలన టైగర్ సినిమా షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ పడగా, ఇప్పట్లో షూటింగ్ మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. సెట్ అప్పటి వరకు ఎలా ఉంటుందో ఏమో అని భావించిన మేకర్స్ పాత సెట్ని పూర్తిగా కూల్చివేసి కొత్త సెట్ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. ఇటీవల అజయ్ దేవగణ్ మూవీ మైదాన్, ఛత్రపతి రీమేక్ సినిమాల కోసం వేసిన సెట్స్ కూడా తుపాను ధాటికి చెల్లా చెదరు అయిన విషయం తెలిసిందే.