ప్రపంచవ్యాప్తంగా జోరుగా వ్యాక్సినేషన్
కరోనాపై పోరులో మానవాళికి కొత్త ఆశ
పారిస్, ఏప్రిల్ 24: కరోనా మహమ్మారితో వణికిపోయిన ప్రపంచానికి వ్యాక్సిన్ రావడం కొత్త ఆశను రేకెత్తించింది. పశ్చిమ దేశాల్లో తొలి టీకాను గతేడాది డిసెంబర్ 8న తొమ్మిది పదుల బ్రిటన్ మహిళ మార్గరెట్ కీనన్కు వేశారు. తర్వాత ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది టీకా రెండు డోసులూ వేయించుకున్నారు. టీకా దుష్ప్రభావాలపై ఆందోళనలు, సరఫరా గురించి సంశయాలు, ధనిక-పేద దేశాల మధ్య అంతరాలను దాటుకొని దేశ దేశాల్లో టీకా కార్యక్రమం ఊహించని విధంగా ముందుకు సాగింది. పలు దేశాల అధినేతలు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సాధారణంగా కొత్త వ్యాక్సిన్ను తయారుచేయడానికి పదేండ్ల సమయం పడుతుంది. గతేడాది కరోనా సృష్టించిన కల్లోలంలో విలవిలలాడుతున్నప్పుడు టీకా రావడానికి చాలాకాలం పడుతుందని ప్రజలు భావించారు. కానీ టీకాను అభివృద్ధి చేయడానికి పలు దేశాల శాస్త్రవేత్తలు రేయింబళ్లు కష్టపడ్డారు. కేవలం 10 నెలల్లోనే టీకా అభివృద్ధి చేసి… కరోనాపై పోరాటంలో కొత్త ఆశలకు ప్రాణంపోశారు.