ప్రజారోగ్యశాఖ సంచాలకుడు జీ శ్రీనివాసరావు
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని, కొన్ని మీడియాసంస్థలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కొవిడ్ కేసుల పెరుగుదలలో స్థిరత్వం వచ్చిందని, ప్రజలు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తే మరో 3-4 వారాల్లో వైరస్ అదుపులోకి వస్తుందన్నారు. ఈ సమయంలో లాక్డౌన్ పెట్టాలనే ఆలోచన కానీ, ప్రతిపాదనలు కానీ ఏమీ ఇవ్వలేదని చెప్పారు. కనీసం అటువంటి ఉద్దేశం కూడా లేదని స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.