బైక్ రేసింగ్లపై మోజు.. ఇద్దరు స్నేహితులను దొంగతనాలవైపు మళ్లించింది. ఖరీదైన బైక్లు దొంగతనం చేసి.. రేసింగ్లకు పాల్పడుతూ.. పాత వి అయిన తర్వాత వాటిని విక్రయించే క్రమంలో వారిద్దరు సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన 10 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సౌత్జోన్ టాస్క్ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి వివరాలను వెల్లడించారు. సరూర్నగర్కు చెందిన ఉత్తమ్కుమార్, సందీప్కుమార్లు ‘బిగ్బాస్కెట్’ విభాగంలో పనిచేశారు. ఈ ఇద్దరికి బైక్ రేసింగ్లంటే ఇష్టం. కొత్త కొత్త బైక్లపై లాంగ్ డ్రైవ్ లు చేసేందుకు, బైక్ రేసింగ్లకు అలవాటు పడ్డారు. ఇందుకు వచ్చే సంపాదన సరిపోకపోవడంతో ఖరీదైన బైక్లను దొంగిలించి.. వాటి నంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేసి రేసింగ్లు, లాంగ్ ట్రిప్ లు చేయాలని ఫ్లాన్ చేశారు.
ఇందులో భాగంగా ఎల్బీనగర్, మీర్పేట, సరూర్నగర్ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ఖైరీదైన బైక్లను దొంగిలించి, తమ కోరికలను తీర్చుకుంటున్నారు. ఆయా బైక్లపై కోరిక తీరగానే.. వాటిని తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. ఇలా విక్రయించే క్రమంలో సౌత్జోన్ టాస్క్ఫో ర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందానికి పట్టుబడ్డారు. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. పది బైక్లను దొంగిలించినట్లు తేలిం ది. పల్సర్-5. రాయల్ ఎన్ఫీల్డ్-2, కేటీఎం డ్యూక్, హోండా యాక్టివా, హోండా షైన్ బైక్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ రాఘవేంద్రతో పాటు ఎస్సైలు నరేందర్, శ్రీశైలం, మహ్మద్ తకీయుద్దీన్ పాల్గొన్నారు.