బోథ్, మే 24 : మలేరియా వ్యాధి గుర్తింపు కోసం ఇంటింటా సర్వే చేపట్టిన ట్లు జిల్లా మలేరియా నివారణాధికారి ఎం శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం బోథ్ మండలం మందబొగుడలో ఇంటింటా సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తించిన గ్రామా ల్లో వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి రక్తనమూనాలు సేకరిస్తున్నారని, ప్రజలు సహకరించాలని కోరారు. మలేరియా పాజిటివ్గా తేలితే బాధితులకు మందులు అందిస్తామన్నారు. కరోనా సోకితే భయపడాల్సిన పనిలేదన్నారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ జిల్లా అధికారి షబానా, సూపర్వైజర్లు అనిల్, ఉదయ్ కిరణ్, మలేరియా విభాగం ఇచ్చోడ సబ్ యూని ట్ అధికారి రవీందర్, సొనాల పీహెచ్సీ సూప ర్వైజర్ నర్సింహస్వామి, సిబ్బందితో పాటు ఉప సర్పంచ్ మడావి కళాబాయి, సోమన్న, ఎంపీటీసీ అమరావతి, దేవిదాస్, తదితరులు ఉన్నారు.
సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
నార్నూర్, మే 24 : సర్వేను పకడ్బందీగా నిర్వ హించాలని జిల్లా మలేరియా నివారణాధికారి శ్రీధర్ సిబ్బందికి సూచించారు. నార్నూర్ సామా జిక ఆరోగ్య కేం ద్రం వైద్య సిబ్బంది ఆధ్వ ర్యంలో రాజుల్గూడ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. స్థానికుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ వైద్య శిబిరాన్ని డీఎంవో శ్రీధర్ పర్యవేక్షించా రు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలే రియా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయి తే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. వైద్యుడు విజయ్ కుమార్, సర్పంచ్ రాథోడ్ సావిందర్, వైద్య సిబ్బం ది గోకుల్,అనిల్ ఉన్నారు. కాగా గాదిగూడ మండ లం పౌనూర్, లోద్ది గూడ గ్రామాల్లో ఝరి పీహె చ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. స్థానికులకు వైద్య పరీక్షలు చేశా రు. రక్త నమూనాలను సేకరించారు. ఇందులో వైద్యుడు పవన్కుమార్, సిబ్బంది ఆడే సంజయ్, శ్రీదేవి, కల్పన, సురేఖ ఉన్నారు.