న్యూఢిల్లీ : ప్రైవేట్ ఎయిర్లైన్స్ స్పైస్జెట్ నిర్వాకం కారణంగా నలుగురు పైలట్లు రోజంతా విమానంలోనే జాగారం చేయాల్సి వచ్చింది. దీనికి ముఖ్య కారణం వారి వద్ద ఆర్టీ-పీసీఆర్ నివేదికలు లేకపోవడమే. పైలట్లకు స్పైస్ జెట్ ప్రీ-ఫ్లైట్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షను నిర్వహించలేదు. దాంతో కరోనా నెగెటివ్ రిపోర్ట్ లేకుండానే వారు క్రొయేషియా చేరుకున్నారు. విమానం నుంచి దిగేందుకు అక్కడి అధికారులు నిరాకరించడంతో పైలట్లు విమానంలోనే దాదాపు 21 గంటలు గడపవలసి వచ్చింది.
స్పైస్ జెట్ యాజమాన్యం ఈ నెల 11 న ఢిల్లీ-టిబ్లిసీ-జాగ్రెబ్ మధ్య ఫ్లైట్ నంబర్ ఎస్జీ -9035 ను నడిపింది. ఇందులో ఇద్దరు కమాండర్లు, ఇద్దరు ఫస్ట్ ఆఫీసర్లు ఉన్నారు. మంగళవారం క్రొయేషియా రాజధాని జాగ్రెబ్లో దిగిన బోయింగ్ 737 విమానం పైలట్లకు మాత్రం దిగేందుకు జాగ్రెబ్ విమానాశ్రయం అధికారులు అనుమతించలేదు. ఢిల్లీ నుంచి క్రొయేషియాకు బయల్దేరే ముందు సిబ్బందికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు అవసరం లేదని క్రొయేషియా అధికారుల నుంచి ఒక ఈమెయిల్ వచ్చిందని స్పైస్ జెట్ అధికారి ఒకరు తెలిపారు. విమానం జాగ్రెబ్ చేరుకున్నప్పుడు ఆర్డర్ మారిందని తెలియజేయడంతో చిక్కంతా వచ్చిపడిందన్నారు.
విమానంలోనే పైలట్లు దాదాపు 21 గంటలు గడిపారు. పైలట్లకు పరిస్థితి సౌకర్యంగా లేకపోవడంతో జాగ్రెబ్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చేందుకు డీజీసీఏ నుంచి స్పైస్ జెట్ ప్రత్యేక అనుమతి పొందింది. దాంతో ప్రయాణికులు, సామానులు లేకుండానే విమానం క్షేమంగా ఢిల్లీ చేరుకున్నది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పైస్ జెట్ యాజమాన్యాన్ని తీవ్రంగా మందలించింది.
100 పడకల కొవిడ్ కేంద్రం ఏర్పాటులో నటి జాక్వెలిన్ బిజీ
టీకాలు తీసుకున్నా.. మాస్క్లు మరువొద్దు : డాక్టర్ రణదీప్ గులేరియా
ఆధునిక హంగులతో రాజధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్
“మీ ప్రియమైన వారి చేయి వదలకండి”: టీనా అంబానీ సందేశం
తెరపైకొచ్చిన మిక్కీ మౌస్.. చరిత్రలో ఈరోజు
అక్కడ మసీదులు మాయమయ్యాయి.. ఎందుకంటే..?
ఉదయం చురుకైన నడకతో కరోనాకు చెక్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..