డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో సోమవారం ఉదయం 12.31 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. చమోలి జిల్లాలోని జోషిమత్కు వాయువ్య దిశలో 44 కిలోమీటర్ల దూరంలో, భూమికి 22 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. డెహ్రాడూన్, పౌరి, గర్హ్వాల్ జిల్లాలతో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం నివేదికలు అందినట్లు సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు.