న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ నియామకం కోసం ఏర్పాటైన కమిటీ వచ్చేనెల రెండో తేదీ లోగా సమావేశం కాలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. ఈ కమిటీలో సభ్యుడు, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వచ్చే నెల రెండో తేదీ వరకు అందుబాటులో ఉండరని సోమవారం కేంద్ర అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు.
సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా గత ఫిబ్రవరి రెండో తేదీన పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సీబీఐ డైరెక్టర్ నియామకం జరుగక పోవడంతో తాత్కాలిక డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా సారధ్యంలో నడుస్తున్నది. దీనిపై కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
చట్ట ప్రకారం సీబీఐ డైరెక్టర్ను ప్రధాని, లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన ప్రతినిధితో కూడిన కమిటీ నియమించాల్సి ఉంది.
పిటిషనర్ తరఫున విచారణకు హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే బైపాస్ చేయడం వల్లే ఈ సమావేశం నిర్వహణలో జాప్యం అవుతుందన్నారు. ఈ నెల 23వ తేదీన జస్టిస్ బోబ్డే పదవీ విరమణ చేయనున్నారు.
ఇక వేగంగా వ్యాక్సిన్లు.. సీరమ్, భారత్ బయోటెక్లకు 4500 కోట్లు
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
ఆదాయ, వ్యయాలపై డేగ కన్ను
కరోనా నివారణకు 8 మార్గాలు
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు.. అదేంటంటే!
డోంట్ కేర్ కరోనా.. బంగారం దిగుమతి పైపైకి
బంగారం కొనేముందు కన్ఫూజన్ వద్దు!
డ్రాగన్ బ్యాంకులు.. భారత్ ఆంక్షలు.. సిటీ నిష్క్రమణ ఎందుకంటే!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..