రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు ఎప్పుడు పునఃప్రారంభం కానున్నాయి? హాలులో బొమ్మ ఎన్నడు పడనుంది? అనే ప్రశ్న ప్రస్తుతం సగటు సినీ అభిమానులందరిలో నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో ఏప్రిల్ నెలలో మూతపడిన థియేటర్లను ఈ నెల 30వ తేదీ నుంచి తెరిచేందుకు యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం సినిమాల ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో వందశాతం ఆక్యుపెన్సీతో పూర్తిస్థాయిలో థియేటర్లను తెరవబోతున్నారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
థియేటర్లలో పార్కింగ్ ఫీజును తిరిగి వసూలు చేసుకునే అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటు తెలంగాణలోని ఎగ్జిబిటర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ బుధవారం ఓ ప్రకటనను విడుదలచేసింది. కరోనా మహమ్మారితో పాటు అనేక కారణాల వల్ల మూతపడటానికి సిద్ధంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం ఆనందంగా ఉందని ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్ పేర్కొన్నారు. పార్కింగ్ ఫీజును వసూలు చేసుకునే అవకాశాన్ని కల్పించాలనే తమ అభ్యర్థనను అంగీకరించి అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్గారికి, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, అరవింద్కుమార్లకు ధన్యవాదాలు తెలిపారాయన. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సింగిల్స్క్రీన్ థియేటర్లకు ఆర్థికంగా ఊరటనిస్తుందని సెక్రటరీ సునీల్నారంగ్ చెప్పారు.