యాదాద్రి, మే4: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ఈ నెల 15వ తేదీ వరకు స్వచ్ఛంద బంద్ పాటించాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట పురపాలక సంఘం కార్యాలయంలో వర్తక వ్యాపారస్తులు, వివిధ సంఘాలు, పార్టీ నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్నుగ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి నుంచి 10 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకే తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు. పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణం, మెడికల్ షాపులకు మినహాయింపు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
‘సంస్థాన్నారాయణపురంలో 14 మందికి..
సంస్థాన్నారాయణపురం,మే 4: మండలం వ్యాప్తంగా 80 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి దీప్తి తెలిపారు. పీహెచ్సీలో 51మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 14మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు.
రాజాపేటలో 8 మందికి కరోనా
రాజాపేట, మే 4: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 26 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ శివవర్మ తెలిపారు.
అడ్డగూడూరులో 14 పాజిటివ్ కేసులు
అడ్డగూడూరు,మే 4: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 34 మందికి కరోనా పరీక్షలు చేయగా 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు ల్యాబ్ టెక్నిషియన్ బాలెంల అరవింద్ తెలిపారు. 14 మందికి కరోనా టీకా వేసినట్లు సూపర్వైజర్ శోభ తెలిపారు.
వలిగొండ మండలంలో 58 మందికి కరోనా
వలిగొండ, మే 4: మండలం వ్యాప్తంగా 58 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి డాక్టర్ సుమన్కల్యాణ్, డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని వలిగొండ, వర్కట్పల్లి, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 214 మందికి పరీక్షలు నిర్వహించగా 58 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు.
22 మందికి కరోనా పాజిటివ్
రామన్నపేట, మే 4: మండలంలో మునిపంపుల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 12 మందికి రామన్నపేట ప్రభుత్వ దవాఖానలో 10 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న 100మందికిగాను 85 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వాణిశ్రీ, ఏఎన్ఎంలు అరుంధతి, మంజుల, కవిత, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
మోటకొండూర్లో 11 మందికి..
మోటకొండూర్, మే 4: మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆయా మండలాలకు చెందిన 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి రాజేందర్ నాయక్ తెలిపారు. ఇందులో ముత్తిరెడ్డిగూడెంలో నలుగురు, నాంచారీపేటలో ఇద్దరు, చామాపూర్లో ఒకరు, వర్టూర్లో ఒకరు, ఇక్కుర్తిలో ఒకరు, వేరే మండలానికి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి
భూదాన్పోచంపల్లి, మే 4 : ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని స్థానిక ఎస్సై వి. సైదిరెడ్డి అన్నారు. మంగళవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో కరోనాపై పోలీస్ కళాబృందం సభ్యులు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జి నాగమల్లు, పోలీసు సిబ్బంది కళాకారులు పాల్గొన్నారు