మేడ్చల్ జోన్ బృందం, జూన్ 21 : తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని సోమవారం టీఆర్ఎస్ నేతలు మేడ్చల్ నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహం, చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేడ్చల్లో మున్సిపల్ చైర్పర్సన్ దీపికానర్సింహారెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి విష్ణుచారి, నర్సింహారెడ్డి, రవీందర్రెడ్డి, సందీప్ పాల్గొన్నారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సురేశ్, వైస్ చైర్మన్ రెడ్డ్యానాయక్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ల బాలేశ్, ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో నాయకులు పాల్గొన్నారు.
కీసరలో కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, కీసర సర్పంచ్ నాయకపు మాధురీవెంకటేశ్ పాల్గొన్నారు. ఘట్కేసర్ మండలం కాచవానిసింగారం గ్రామంలో ఘట్కేసర్ ఎంపీపీ, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్రెడ్డి, సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి బుడిగే కృష్ణ, పాల్గొన్నారు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ముదిరాజ్, ప్రధానకార్యదర్శి రెడ్డిశెట్టి మహేశ్గుప్తా, కార్పొరేటర్లు పాల్గొన్నారు. బోడుప్పల్ టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక మేయర్ సామల బుచ్చిరెడ్డి హాజరై నివాళులర్పించారు.
పీర్జాదిగూడ, జూన్ 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు అందుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం పీర్జాదిగూడ నగరసాలక సంస్థలో స్థానిక మేయర్ జక్క వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతికి మంత్రి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచ స్థాయిలోని అన్ని వర్గాలకు కళ్లకు కట్టినట్లు తెలియజెప్పిన మహానుబావుడు అన్నారు. కార్యక్రమంలో మేయర్ జక్క వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.