న్యూఢిల్లీ: ఫిల్మ్ యాక్టర్, మోడల్ మిలింద్ సోమన్ తన ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫోటోలను పోస్టు చేశారు. తన సోదరీమణులతో కలిసి రక్షాబంధన్ సెల్రబేట్ చేసుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోను మిలింద్ పోస్టు చేశాడు. తమ కుటుంబం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక పండుగ ఇది అని ఆ ఫోటోకు ట్యాగ్ ఇచ్చాడు. మిలింద్కు నేత్రా, మేధా, అనుపమా తోబొట్టువులు ఉన్నారు. తన సోదరీమణులతో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఫోటోలను మిలింద్ పోస్టు చేశాడు. ఇన్స్టాలో పెట్టిన ఓ ఫోటోలో మిలింద్ తన చేయికి రాఖీలు కట్టుకుని ఉన్నాడు. తన ముగ్గురు సిస్టర్స్ ఆ రాఖీలు కట్టినట్లు చెప్పాడు. మరో ఫోటోలో సోమన్ నుదురుపై సిస్టర్స్ తిలకం దిద్దారు. తన ఫ్యామిలీలో రక్షాబంధన్ ఒక్కటే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజున కలవాలని నిర్ణయించుకున్నామన్నారు.