ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి సంబధించిన సెలబ్రిటీస్ తమ ట్విట్టర్ ద్వారా జనాలలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మొక్కల్ని కాపాడాలి, చెట్లను పెంచాలి, అడవుల్ని డెవలప్ చెయ్యాలి అంటూ సలహాలు ఇస్తున్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం పర్యావరణ వ్యవస్థను పునరుద్దరించుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం. మన భూగ్రహాన్ని పచ్చగా ఉండే ప్రయత్నం చేద్దాం అని మహేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
మనం నివసించడానికి ఉన్న ఏకైక ఇల్లు భూమి. దానిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం అందరు ఈ భూమిని కాపాడుకునేందుకు కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు సాయి ధరమ్ తేజ్. ఇక అల్లు అర్జున్ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కను నాటిన ఫొటో షేర్ చేస్తూ ఈ పర్యావరణ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు ఎక్కువ మొక్కలు నాటుదాం అని ప్రతిజ్ఞ చేద్ధాం. రానున్న తరాల వారికి కూడా ఆకుపచ్చగా ఉండే భూమిని ఇచ్చే ప్రయత్నం చేద్దాం అని అన్నారు. అలానే మొక్కలను నాటిన ఫొటోలు తనకు షేర్ చేస్తే వాటిని రీ షేర్ చేస్తానని అన్నారు బన్నీ.