ముంబై ,జూన్ 23 : షేర్ల విలువ నిన్న భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూచీలు అప్రమత్తంగా కలాడుతున్నాయి. మంగళవారం సెన్సెక్స్ 53వేల మార్కును దాటి కిందకు వచ్చింది. ఇవాళ ఊగిసలాటలో ఉన్నది.సెన్సెక్స్ 52,912.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,912.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,434.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,862.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,862.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,726.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
నిఫ్టీ 73.22 (0.14%) పాయింట్లు నష్టపోయి 52,515.49 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 13.30 (0.084%) పాయింట్లు నష్టపోయి 15,759.40 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
ఇవాళ టాప్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 2.67 శాతం, హీరో మోటో కార్ప్ 1.77 శాతం, హిండాల్కో 1.40 శాతం, టైటాన్ కంపెనీ 1.07 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.97 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో విప్రో 2.24 శాతం, శ్రీసిమెంట్స్ 1.33 శాతం, అదాని పోర్ట్స్ 0.97 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 0.92, హెచ్డిఎఫ్సి 0.71 శాతం నష్టపోయాయి.