దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. . ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఏప్రిల్ 23న విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. కాని కరోనా ఎఫెక్ట్తో చిత్ర రిలీజ్ వాయిదా వేశారు.
ఏప్రిల్ 23న తలైవి చిత్రాన్ని అన్ని భాషలలో విడుదల చేయాలని అనుకున్నాం. కాని కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో మా నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం. పరిస్థితులు మెరుగైన తర్వాత చిత్ర యూనిట్ కొత్త డేట్ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రకటనని ‘థియేటర్లు తెరుచుకుంటేనే.. థియేటర్ల వ్యాపారం బాగుంటుంది’ అంటూ కంగనా ట్వీట్ చేసింది. గోతిక్ ఎంటర్టైన్మెంట్ మరియు స్ప్రింట్ ఫిలిమ్స్ అసోసియేషన్తో విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ మరియు జీ స్టూడియోలు సమర్పించిన తలైవి చిత్రానికి విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాతలు. హితేష్ ఠక్కర్ మరియు తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ విఠల్ కెమెరామెన్గా పని చేస్తున్నారు.