తమిళ (Kollywood) స్టార్ హీరో దేశరాజధాని నగరం ఢిల్లీకి వెళ్లాడు. తన కొత్త చిత్రం తదుపరి షెడ్యూలు లో సదరు హీరో పాల్గొననున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది..బీస్ట్ లో నటిస్తున్న విజయ్ (Vijay). బీస్ట్ కొత్త షెడ్యూలును ఢిల్లీలో ప్లాన్ చేశారు డైరెక్టర్ అండ్ టీం. ఎకానమీ క్లాస్ లో విజయ్ వెళ్తున్న స్టిల్స్ కొన్ని నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ (Delhi ) షెడ్యూల్ను వారం పాటు ఫిక్స్ చేశాడట డైరెక్టర్. ఢిల్లీలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్షన్ కో ఆర్డినేటర్ అన్బరివ్ నేతృత్వంలో స్టంట్స్ తీయనున్నట్టు తాజా సమాచారం.
ఢిల్లీలో చిత్రీకరణ పూర్తవగానే విజయ్ అండ్ టీం తదుపరి షెడ్యూలు కోసం రష్యా (Russia ) కు వెళ్లనున్నారు. రష్యాలో మేజర్ పార్టు షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ పూజాహెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సనిమా విడుదలకాబోతుంది.
కాగా పూజాహెగ్డే మరోవైపు అఖిల్ తో కలిసి నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అక్టోబర్ 8న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ తో కలిసి నటిస్తోన్న రాధేశ్యామ్ 2022 జనవరి 14నవ విడుదల కాబోతుంది.
Adivi Sesh: డెంగ్యూ ఫీవర్తో ఆసుపత్రిలో చేరిన యువ హీరో..!
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్