తమిళ స్టార్ హీరో అజిత్ తనకు హిట్స్ ఇచ్చిన దర్శకులితో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హెచ్ వినోద్తో ముచ్చటగా మూడో సినిమా చేసేందుకు సన్నద్దమయ్యాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నెర్కొండ పార్వాయి చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం వాలిమై అనే చిత్రం తెరకెక్కుతుంది. కరోనా వలన ఈ చిత్ర రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో అజిత్ సరసన హ్యూమా ఖురేషీ నటిస్తోంది. యువ నటుడు కార్తికేయ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. యువన్ శంకర్రాజా స్వరాలు సమకూరుస్తున్నారు.
వాలిమై చిత్రంపై కూడా అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. వాలిమై ఫస్ట్ లుక్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సమయంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.తల 61 చిత్రాన్ని కూడా హెచ్ వినోద్ తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది. క్యాస్టింగ్ ఎవరు తదితర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.