ఢిల్లీ ,జూన్ 11: ప్రముఖ అర్థశాస్త్రవేత్త, పర్యావరణవేత్త ప్రొఫెసర్ రాధామోహన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.‘‘ప్రొఫెసర్ రాధామోహన్ గారు వ్యవసాయం పట్ల, ప్రత్యేకించి దీర్ఘకాాలికమైన వ్యవసాయం పట్ల, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల పట్ల ఎంతో మక్కువ కనబరచే వారు. ఆర్థిక వ్యవస్థ కు, పర్యావరణానికి సంబంధించిన విషయాలపైన ఆయన కు గల జ్ఞానానికి గాను ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించడం జరిగింది. ఆయన కుటుంబానికి, ఆయన్ని అభిమానించే వారికి ఇదే నా ప్రగాఢ సానుభూతి. ఓమ్ శాంతి.’’ అని ప్రధాన మంత్రి మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.